తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేరళలోని దక్షిణ భాగంలో సోమవారం నుంచి విస్తారంగా కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశంతో అవి మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు సోమవారమే ప్రవేశించాయి.