కామెడీ షోలకు రేటింగ్ పెరుగుతోంది. దీంతో అన్ని ఛానెళ్లు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మొగ్గు చూపిస్తున్నాయి. కామెడీ కాస్త శృతి మించి వ్యంగ్య అర్ధాలతో స్కిట్లుచేయడం మెదలుపెట్టారు టీమ్ లీడర్లు. ఇలాంటి కామెడీని కొంత మంది వ్యతిరేకిస్తుండగా మిగతా వారు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి వరకు అయితే ఓకే. కాని షోల ను నిర్వహించే యాంకర్లు శృతిమించితే ఛానెల్ ఉనికికి ప్రమాదం లేకపోలేదు. చలపతిరావు ఎపిసోడ్ తరువాత ఛానెల్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా ముందస్థు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. యాంకర్ రవి ప్రశ్నఅడిగి ఉండకపోయి ఉంటే చలపతిరావు మాట్లాడి ఉండేవారు కాదని సినీ వర్గాలు అంటున్నాయి. ఏదీ ఏమైనా యాంకర్లను అదుపు చేయాలని ఛానెల్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పటాస్ నుంచి యాంకర్ రవిని ఇప్పటికె తొలగించారు. తాజాగా శ్రీముఖిని కూడా తీసేస్తున్నట్టు మల్లెమాల ప్రొడక్షన్స్ ప్రకటించింది. శ్రీముఖి సంభాషణలు శృతిమించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఇకనైన యాంకర్లు తమ పద్దతి మార్చుకుంటే బాగుంటుందని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు.