మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోల్ కతాకు ఈశాన్యంగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇది బంగ్లాదేశ్ వైపు కదులుతున్నదని… సోమవారం రాత్రికల్ల తీవ్రవాయుగుండంగా మారి 48 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఈ వాయుగుండానికి మోరా అని పేరు పెట్టారు. వాయుగుండంతో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ కేరళకు ఈ నెల 30, 31 తేదీల్లో చేరుకుంటాయని చెప్తున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఆకాశం మేఘావృతమై గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయంటున్నారు. వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు.