ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోరా నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2017, 03:40 PM

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోల్ కతాకు ఈశాన్యంగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇది బంగ్లాదేశ్  వైపు కదులుతున్నదని… సోమవారం రాత్రికల్ల తీవ్రవాయుగుండంగా మారి 48 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఈ వాయుగుండానికి మోరా అని పేరు పెట్టారు. వాయుగుండంతో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ కేరళకు ఈ నెల 30, 31 తేదీల్లో చేరుకుంటాయని చెప్తున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఆకాశం మేఘావృతమై  గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయంటున్నారు. వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలోని కొన్ని  జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com