ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి, పోలవరం నాకు రెండు కళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2017, 03:09 PM

విశాఖ: అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా పనులు ఆగవన్నారు. పోలవరంతో రాష్ట్రంలో కరవును పారద్రోలుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ తక్కువని.. పట్టణీకరణ పెరిగితేనే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. విశాఖ, తిరుపతి సహా అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతిలో పరిపాలన భవన సముదాయం ఆకృతులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com