విశాఖ: అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా పనులు ఆగవన్నారు. పోలవరంతో రాష్ట్రంలో కరవును పారద్రోలుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ తక్కువని.. పట్టణీకరణ పెరిగితేనే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. విశాఖ, తిరుపతి సహా అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతిలో పరిపాలన భవన సముదాయం ఆకృతులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారు.