చైనా వుహాన్ లో కర్నూలు జిల్లా యువతి చిక్కుకుపోయింది. శృతి టీసీఎల్ లో ఉద్యోగ శిక్షణకు వెళ్ళింది. శృతి స్వస్థలం కర్నూలు జిల్లా ఈర్లపాడు. శృతికి జ్వరం ఉండడంతో వెనక్కి రప్పించేందుకు అధికారులు అంగీకరించలేదు. రెండు విమానాల్లోనూ శృతిని అధికారులు అనుమతించలేదు. తనకు కరోనా వైరస్ లక్షణాలు లేవంటుంది. తన భాదను శృతి వీడియో ద్వారా తల్లికి పంపింది. శృతి తల్లి ఆందోళన చెందుతుంది.