రాంచీ: ఝార్ఖండ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ధన్భాద్ రైల్వే డివిజన్లో చిచకి-కామబంధ్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలు పేల్చివేశారు. సిబ్బంది సమాచారంతో ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రైల్వే సిబ్బంది పట్టాలు మరమ్మతులు చేస్తున్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.