ఏపీలో దారుణం జరిగింది. నలుగురు యువకులు బాలుడి పై లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందం పొందారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అవుకులో నలుగురు యువకులు ఓ 13 ఏళ్ల బాలుడిని డిన్నర్ ఉందంటూ 3 రోజుల క్రితం తీసుకెళ్లారు. అక్కడ బాలుడి దుస్తులు విప్పి మర్మాంగాల ప్రాంతంలో చీపురు కట్టను చొప్పించే ప్రయత్నం చేశారు. బాలుడు ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు. బాలుడి అరుపులతో పైశాచికానందం పొంది వీడియోలు తీశారు. అనంతరం బాలుడిని వదిలి వెళ్లారు. బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి పై దాడికి పాల్పడింది బుల్లెట్ రాజా, ప్రవీణ్, మరో ఇద్దరు యువకులుగా పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశార. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఇది కలకలంగా మారింది.