మారిషస్ ఆర్ధికంగా అభివృద్ధికి భారత్ సాయం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధాని జగన్నాథ్ తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మారిషస్ అభివృద్ధి కోసం 500మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో మారిషస్ ప్రధాని సైనిక వందనం స్వీకరించారు. అనంతరం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిశారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.