ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం... రెండు బస్సులు ఢీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 07, 2020, 05:11 PM

సిరివెళ్ల మండల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో గల సర్వ నరసింహ స్వామి ఆలయ సమీపంలో మంగళవారం ఉదయం రెండు బస్సులు ఢీ కొన్నాయి. విజయవాడ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, నంద్యాల వైపు నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు అనంతపురం జిల్లా యాడికి మండలం బుగ్గ గ్రామానికి చెందిన అనూష, ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన నాగేశ్వరమ్మ, సురేశ్‌, ఆదిమూర్తిపల్లెకు చెందిన ఎస్‌.మణి, ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ రసూల్‌లుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మహానంది ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa