ఆఫ్రికాతో భారత్ కు దశాబ్దాల అనుబంధం ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆఫ్రికా స్వాతంత్ర పోరాటానికి భారతీయ నేతలు మద్దతు తెలిపారని, నాటి నుంచి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతూ వస్తున్నాయన్నారు. గుజరాత్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంక్ వార్షికోత్సవ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ఆఫ్రికాతో భారత్ కు మంచి సంబంధాలున్నాయని, ఆర్ధికంగా ఇరు దేశాలు వృద్ధి చెందేందుకు పరస్పర సహకారం అందించుకోవాలన్నారు.