తిరుమల: తిరుమలలో భక్తుల రద్ది పెరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన వచ్చిన భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతోంది.