అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’. పూజా హెగ్డే కథానాయిక. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్రాజు నిర్మాత. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘శరణం భజే భజే’ అంటూ సాగిన ఈ పాటని జొన్నవిత్తుల రచించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్న చిత్రమిది. ‘శరణం భజే భజే’ పాట కథానాయకుడి పాత్ర పరిచయ గీతంలా వినిపిస్తోంది. ‘‘అల్లు అర్జున్ని కొత్త కోణంలో చూపించే చిత్రమిది. అన్ని వర్గాల వారినీ తప్పకుండా అలరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్కి మంచి స్పందన వస్తోంది. ఒక్కో పాటనీ ఇలా ఆన్లైన్లో విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది.