ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలకు బీజేపీని అలవాటుగా మారింది: కన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 07:30 PM

విజయవాడ: టీడీపీ నేతలకు బీజేపీని విమర్శించడం అలవాటుగా మారిందని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  టీడీపీ నేతలు విమర్శించడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఖండించడం ఇదంతా ఓ నాటకంలా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా కుట్రలను తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఆయన తెలిపారు.అలాగే ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ అభిప్రాయామా అనేది చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రిని ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేముందని, ఇందులో పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా  గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే విజయవాడలో టీడీపీ మరింతగా భారీ మెజార్టీతో గెలిచేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు  చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com