ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధునిక సదుపాయాలతో తేజస్ రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 06:18 PM

తేజస్ రైలు ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో వచ్చిన అన్ని ట్రెయిన్‌ల కన్నా విలాసవంతమైంది.


*  ఇందులో ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్స్, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. 


* ఈ రైలు గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ముంబై నుంచి గోవా వరకు మొత్తం 579 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రెయిన్ కవర్ చేస్తుంది. అందుకు గాను ఈ రైలుకు దాదాపుగా 8 గంటల సమయం పడుతుంది. 


* త్వరలో ఢిల్లీ-చండీగడ్, ఢిల్లీ-లక్నో మార్గాల్లో కూడా ఇలాంటి రైళ్లను నడపనున్నారు.


* తేజస్ రైలులో ముంబై నుంచి గోవా వరకు రూ.2,525 చార్జి అవుతుంది. ఆహారం కావాలనుకుంటే రూ.2,680 వరకు ఒకరికి చార్జి అవుతుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు ఈ చార్జి ఉంటుంది. అదే చెయిర్ కార్‌లో వెళితే రూ.1,155 వరకు ఒకరికి చార్జి చేస్తారు. ఫుడ్ కావాలనుకుంటే వీరు రూ.1,280 చెల్లించాల్సి ఉంటుంది. 


* తేజస్ రైలు కోచ్‌లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ కోచ్‌లు పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారు చేయబడ్డాయి. అంటే ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు. అదేవిధంగా దుమ్ము, ధూళి కూడా పెద్దగా అంటుకోదు. 


* తేజ‌స్ రైలులో సీట్ల‌ను అత్యంత అధునాత‌న డిజైన్‌తో త‌యారు చేశారు. వాటిలో కూర్చుంటే రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులు ఉండ‌వు. దీంతో ప్ర‌యాణంలో ఎక్కువ అల‌స‌ట ఉండ‌దు. 


* తేజస్ రైలును సీజన్‌లో వారానికి 5 రోజులు నడపనున్నారు. అన్‌సీజన్‌లో వారానికి 3 రోజులే నడుస్తుంది. 


* ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉన్న 20 కోచ్‌లు ఈ ట్రెయిన్‌లో ఉన్నాయి. చెయిర్ కార్ ఉన్న కోచ్‌లు 12 ఉన్నాయి. మొత్తం 32 బోగీలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఒక్కో బోగీకి 56 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అదే చెయిర్ కార్‌లో అయితే 78 మంది వరకు ప్రయాణించవచ్చు. 


* తేజస్ రైలును దాదాపుగా అన్ని రకాల భద్రతా ప్రమాణాలు కలిగి ఉండేలా తయారు చేశారు. ఇందులో అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్ టెక్నాలజీలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రైలులో ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను ప్రదర్శించనున్నారు. దీంతో రైలు ఎక్కడుందో ప్రయాణికులకు సులభంగా తెలుస్తుంది. 


* దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో కూడా ఇందులో సమాచారాన్ని ఏర్పాటు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com