ముంబై: భారతీయ రైల్వేలో అత్యంత విలాసవంతమైన రైలు తేజస్ ఎక్స్ప్రెస్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు దీన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్లో ఇవాళ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ రైలు ప్రతీ మంగళ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేషన్లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు గోవాలోని కర్మాలీ రైల్వే స్టేషన్కు చేరుకుంటది. అదేవిధంగా కర్మాలీ రైల్వేస్టేషన్ నుంచి తిరిగి అదేరోజుల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 11 గంటలకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేషన్కు చేరుకుంటది. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ భారతీయ రైల్వే భవిష్యత్ దర్శనాన్ని ఈ రైలుతో ఊహించుకోవచ్చన్నారు. ప్రధాని కలల ప్రాజెక్ట్ మేకిన్ ఇండియాలో భాగంగా కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తేజస్ రైలు రూపుదిద్దుకుందన్నారు. తేజస్ రైలు గంటలకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాగా ఈ రైలు గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.