హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తాజాగా గ్రాడ్యుయేట్ పట్టా అందుకుందట. ఈ విషయాన్ని ఆమే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి తాను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎం.బి.ఏ) ని సక్సెస్ ఫుల్గా పూర్తిచేశానని చెప్పింది. తన చదువుకోసం విదేశాల్లోనే గడిపిన ఈ అమ్మడు ఇక తన చదువు అయిపోయింది కనుక మళ్లీ నటిస్తుందని సినీ పరిశ్రమలో టాక్. లీడర్, నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రిచా కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే.