ధనుష్, అమలాపాల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం విఐపి మూవీ తెలుగులో రఘువరన్ బిటెక్ టైటిల్ తో విడుదలై ధనుష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా విఐపి2 పేరుతో మూవీ రూపొందుతుంది. ఈ చిత్రం కూడా తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇందులో కాజోల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇండస్ట్రియలిస్ట్ గా నెగెటివ్ పాత్రలో కనిపించనుంది. 1997లో మినసర కనువు అనే తమిళ చిత్రంలో నటించిన కాజోల్ రెండు దశాబ్ధాల తర్వాత వీఐపీ2 అనే సౌత్ మూవీ చేస్తుంది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య తెరకెక్కిస్తుంది. కొచ్చాడియాన్ తర్వాత సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం వీఐపీ2. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ధనుష్ ,కాజోల్ పై ఓ ప్రమోషనల్ సాంగ్ ని ముంబైలో చిత్రీకరిస్తున్నారట. ఈ సాంగ్ ని మూవీ రిలీజ్ కి ముందు విడుదల చేసి సినిమాకి భారీ ప్రమోషన్ లభించేలా ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్.