టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ తన 24వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రిన్స్ కి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల ,ఈ చిత్రాన్ని కూడా చాలా రిచ్ గా తెరకెక్కించాలనే ప్లాన్ అన్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని నేటి నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11, 2018న విడుదల చేయనున్నారు. హైదరాబాద్ లోనే కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రధాన పాత్రలపైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. త్వరలోనే మహేష్ కూడా మూవీ టీంతో జాయిన్ కానున్నాడు. మహేష్ 24వ చిత్రంలో ప్రిన్స్ పొలిటీషన్ గా కనిపించనున్నట్టు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.