హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'దువ్వాడ జగన్నాథం' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. వచ్చేనెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు."డీజే శరణం భజే భజే" అనే సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు. టీజర్ తో పెరిగిన అంచనాలు .. ఈ సాంగ్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళతాయని ఈ సినిమా టీమ్ భావిస్తోంది. ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడిగానే కాకుండా .. మరో విభిన్నమైన గెటప్ లోను అల్లు అర్జున్ కనిపించనుండటం విశేషం.