అమరావతి : మాట వినకపోతే, ప్రలోభాలకు లొంగకపోతే మనుషులను చంపేసే స్థాయికి చంద్రబాబు రాజకీయాలను దిగజార్చేశారని వైకాపా అధినేత జగన్ విమర్శించాు. గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నారాయణ రెడ్డి హత్య జరిగిన కొన్ని గంటల తరువాత కానీ పోలీసులు అక్కడకు చేరుకోలేదన్నారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. అధికార తెలుగుదేశం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని దుయ్యబట్టారు. గవర్నర్ ను కలిసిన వారిలో జగన్ తో పాటు ఎమ్మెల్యే రోజాచ శ్రీకాంత్ రెడ్డి, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు.