ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నంలోని లంబసింగి పంచాయతీ పరిధిలో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 10:49 AM

విశాఖ మన్యానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులు సామూహిక అత్యాచారానికి గురైనట్టు సమాచారం. అయితే విషయాన్ని బయటికి రానీయకుండా గ్రామపెద్దలు అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ విషయం బయటికి వస్తే ఆ కుటుంబాల పరువుతో పాటూ, గ్రామం పరువు కూడా పోతుందని వారు అలా చేసినట్టు సమాచారం. విశాఖపట్నంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన ఇద్దరు యువతుల ఓ వేడుకలో పాల్గొనేందుకు చింతపల్లి మండలంలోని వేరే గ్రామానికి వెళ్లారు. వీరికి తోడుగు అదే గ్రామం నుంచి ఇద్దరు యువకులు కూడా వెళ్లారు. కార్యక్రమం ముగిశాక ఇంటికి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఏడుగురు యువకులు ఆ ఇద్దరు యువతులను నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. వారితో పాటు వచ్చిన ఇద్దర అబ్బాయిలను తీవ్రంగా కొట్టారు. ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. నిందితులు కూడా ఉన్నత కుటుంబాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అందుకే విషయం బయటికి రాలేదని కూడా కొందరి వాదన. తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇంకా అందలేదని చెప్పారు చింతపల్లి ఎస్సై రమేష్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com