ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది లక్షల నీటికుంటల తవ్వకం లక్ష్యం : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 10:14 AM

అమరావతి : రాష్ట్రంలో పది లక్షల నీటి కుంటల తవ్వకం లక్ష్యంగా పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు అన్నారు. నీరు-ప్రగతి-పురోగతిపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ నీరు- ప్రగతి కార్యక్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. కళాశాలలన్నీ గ్రామాలతో అనుసంధానం కావాలని చంద్రబాబు చెప్పారు. మహిళా సంఘాల ద్వారా 50 వేల ఎకరాలలో పశుగ్రాసం సాగు చేయించాలని చంద్రబాబు అన్నారు. పిడుగు పాటు సమాచారం ఇస్తే చాలదు, ప్రాణ నష్టం నివారించాలన్నారు. విపత్తు, వాతావరణ శాఖలు కాల్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com