-హార్టీకల్చర్పంటల సాగులో 35 శాతం వృద్ధి
-నధులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి
-ఖరీఫ్ సాగులో మరింత మెరుగైన నీటి నిర్వహణ
-టెలికాన్ఫరెన్సలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఓర్వకల్లు, కడప, తిరుపతి, పుట్టపర్తి నుంచి పండ్ల ఎగుమతులను మరింతగా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్సలో ఆయన మాట్లాడుతూ అరటి, దాని మ్మ, బత్తాయి ఎగుమతులకు కావాల్సిన లాజిస్టిక్స రాయ లసీమలో నెలకొల్పాలన్నారు. ఖరీఫ్లో పంటల సాగుకు ఉపయోగపడేలా బీమా పరిహారం చెల్లింపులు ముందేచే యాలని, ఫిబ్రవరి నెలాఖరుకు క్లెయిమ్స సెటిల్ చేయా లని ఆయన అధికారులను ఆదేశించారు. మార్చిలో బీమా నిధులు విడుదల చేయాలని, సాయిల్ హెల్త కార్డుల పంపిణీ మే నెలకల్లా పూర్తిచేయాలని కూడా ఆయన ఆదేశించారు. హార్టీకల్చర్ పంటలసాగులో 35శాతం వృద్ధి సాధిం చాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీ కరణ బడ్జెట్ రూ. 217 కోట్లు ఖర్చు చేశారని, మిగిలిన రూ. 70 కోట్లు కూడా వ్యయం చేయాలన్నారు. వర్షా లు 27శాతం తగ్గినా సమర్ధ నీటి నిర్వహణ ద్వారా అధిగమించామన్నారు. రానున్న ఖరీఫ్ సాగులో మరింత మెరుగైన నీటి నిర్వహణ కనబరచాలని, పట్టిసీమ నీటితో కృష్ణా ఆయకట్టులో ముందస్తు ఖరీఫ్కు వెళ్ళాలని, దానివల్ల 3 పంటలకు ఆస్కారం ఉంటుందని సీఎం సూచించారు. వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియను ఈ రెండుమూడు నెలల్లో పూర్తిచేయాలని, ఏప్రిల్, మే కల్లా వ్యవసాయం, అనుబంధ శాఖలు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. గ్రామీణ పేదలకు వ్యవసాయమే ఉపాధి అని ఆయన అన్నారు. వ్యవసాయంలో సంక్షోభం అధిగమిస్తే ఇక ఏ సంక్షోభం మనదరికి చేరదని చెప్పారు. అన్ని శాఖలు నిధులు సక్రమంగా సద్వినియోగం చేసుకో వాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నిధుల సమీకరణపై రాష్టస్థ్రాయిలో సదస్సు నిర్వహించాలని అన్నారు. సాయిల్ హెల్త కార్డుల పంపిణీ మే నెలకల్లా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హార్టీకల్చర్ పంటలసాగులో 35శాతం వృద్ధి్ద సాధించాలని ఆయన అన్నారు. రానున్న ఖరీఫ్ సాగులో మరింత మెరుగైన నీటి నిర్వహణ చేపడుతామని ఆయన అన్నారు. వర్షాలు 27శాతం తగ్గినా సమర్ధ నీటి నిర్వహణతో అధిగమించామని చెప్పారు.