ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుకు కొత్త తలనోప్పి తెచ్చి పెట్టిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 25, 2019, 04:02 PM

ఏపీలో అధికారం కోల్పోయి అపలేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సోంత పార్టీ నేతలే కొత్త తలనోప్పులు తెస్తున్నారు. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన రైతుల్లో ఏమో కానీ.. టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. స్వయంగా చంద్రబాబు రాజధాని రైతులు చేస్తున్న ధర్నాలో పాల్గోన్నారు. రాజధాని మార్పు ప్రకటన తర్వాత అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి చెందిన నేతలు రోజు ధర్నాలు చేస్తున్నారు.


అయితే పార్టీ అధ్యక్షుడు నిర్ణయాన్ని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే దిక్కరిస్తున్నారు. టీడీపీలో సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూల్ లో హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళీ విశాఖ క్యాపిటల్ ను సమర్థించారు. ఇక విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నేతలు విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయాల్సిందేనని ప్రకటించారు. విశాఖ నేతలు ఇంతటితో ఆగకుండా కొత్త రాజధాని ప్రకటనను స్వాగతిస్తూ తీర్మానం చేసి ఏకంగా అధినేత చంద్రబాబుకు లేఖను పంపించారు.


ఇదిలావుంటే విశాఖ నేతల లేఖతో పార్టీకి సంబంధం లేదని అమరావతి నేతలు ప్రకటించారు. రాజధానిని మారిస్తే కోర్టుకెళ్తామని కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ప్రకటించారు. ఇలా ప్రాంతాల వారిగా నేతలు చేస్తున్న ప్రకటనలతో చంద్రబాబు ఏం చేయాలో ఆర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అధికారాన్ని చేజిక్కించుకుని చంద్రబాబుకు షాకిచ్చిన జగన్.. తాజాగా రాజధాని మార్పు ప్రకటన చేసి టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజధాని మార్పుపై పార్టీ నేతల ప్రకటనలను చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది అసక్తికరంగా మారింది. దీనికి తోడు ఈ నెల 27న జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఎలాంటి షాక్ లు ఇస్తారోనన్న భయం టీడీపీ నేతలను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa