ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజుకో విధంగా మలుపు తిరుగుతోంది. డిసెంబర్ 27న కేబినేట్ సమావేశం తర్వాత దీని పై అధికారిక ప్రకటన చేయనున్నారు. మరో వైపు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులు వైజాగ్ లో తమకు అందుబాటులో ఉన్న అధికారుల ద్వారా భవనాల సేకరణ జరుపుతున్నట్టు సమాచారం.
రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్ 1లో సచివాాలయం రానుందని తెలుస్తోంది. దాని పక్కనే ఉన్న స్టార్టప్ విలేజ్ లో సీఎం క్యాంపు కార్యాలయం ఉండనుందని సమాచారం. అమరావతిలోని శాఖాధిపతుల నుంచి స్థానిక అధికారులకు భవనాల తరలింపు పై సమాచారమందినట్టు చర్చ జరుగుతోంది.
ఇప్పటికే మిలీనియం టవర్ 2 పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు నగరంలోని విప్రో భవనాన్ని కూడా సర్కార్ తీసుకోనుందని సమాచారం. ప్రభుత్వం ఆదేశిస్తే స్థల, భవనాల సేకరణను రోజుల్లో చేస్తామని ఇటీవల విశాఖ కలెక్టర్ ప్రకటించారు. మరో వైపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించిన నెల రోజుల్లోనే డిపార్ట్ మెంట్లన్ని అక్కడికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa