ఏపీకి మూడు రాజధానుల అంశం రోజుకో విధంగా మలుపు తిరుగుతోంది. రాజధాని ప్రాంతాన్ని తరలించవద్దని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు 7 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నేతలు కూడా వారికి మద్దతు పలికారు. బీజేపీ నేతలు కూడా పరోక్షంగా వారికి మద్దతు పలుకుతున్నారు.
సీఎం జగన్ అసెంబ్లీలో రాజధాని ప్రాంతం పై మాట్లాడారు. ఆ తర్వాత జీఎన్ రావు కమిటి కూడా 3 రాజధానులకు ప్రతిపాదించింది. వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయనున్నామని సీఎం జగన్ తెలిపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సంతోషం వ్యక్తం అయినా మరికొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. మరో వైపు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ది ఏం ఉండదని సీమ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టుతో పాటు వింటర్ అసెంబ్లీ సమావేశాలను కర్నూలులో నిర్వహించాలని, మినీ క్యాపిటల్ ను కూడా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు అమరావతి ప్రాంతంలో ఉద్యమం రోజురోజుకి తీవ్రమవుతుంది. అయితే తాజాగా ఉద్యమ పరిస్థితి మారినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంత రైతులు గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల పై రాజీనామా చేయాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో సమైక్యాంధ్ర నాటి సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామా చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అమరావతిలో రోజు రోజుకు పరిస్థితులు మారుతుండడంతో సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa