ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రాజధానులపై ఉప రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 04:29 PM

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పాలనపరమైన నిర్ణయమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తాను చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ వ్యాఖ్యలు మూడు రాజధానుల వ్యవహారంతో సంబంధం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa