అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతనిధి : అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, నేతల విభేదాలపై చర్చించారు. అంతేకాకుండా ఇతర పలు అంశాలపై కూడా చర్చించినట్లు సమా చారం. సామర్థ్యం, పని తీరు ఆధారంగానే మంత్రుల కొనసాగింపు కానీ, తొలగింపు ఉంటుం దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయవాడలో జరిగిన టీడీపీ వర్కషాప్లో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. పదవులు ఇవ్వడం ముఖ్యమంత్రిగా తన అధికార పరిధిలోని అంశమని ప్రారంభ సభలోనే చెప్పిన ఆయన ఆ తర్వాత ఆంతరంగికంగా చేసిన ప్రసంగంలో హెచ్చరికలు చేశారు. ఇన్చార్జుల ప్రజాదరణ పెరగకపోతే వదులుకుంటానని, కొత్తవారికి అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. గతంలో చేసిన తప్పును ఈసారి చేయబో నన్నారు. 30 ఏళ్ల నుంచీ ఉన్నారని మొహమాటపడి గతంలో కొంతమందికి సీట్లు ఇచ్చి దెబ్బతిన్నానని వ్యాఖ్యానించారు. విభేదాలు వీడి సమన్వయంతో ప్రజాదరణను పెంచుకోవాలని అందరికీ సూచించారు. నాలుగైదు జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి జిల్లాల సమీక్షలలో వాటికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. ప్రత్యేకించి మూడు జిల్లాల పేర్లు ప్రస్తావించారు. కర్నూలులో విభేదాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అనంతపురం విభేదాలనూ ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు యార్లగడ్డ శిరీష తమ జిల్లాలో విభేదాలు లేవని చెప్పినప్పుడు తనకన్నీ తెలుసని సీఎం అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల పనితీరుపై తయారు చేసిన నివేదికలను చంద్రబాబు సీల్డ కవర్లలో వారికి అందించారు.
వాటిలో ప్రధానంగా ఆయా నేతల పరిధిలో పార్టీ కార్యక్రమాలు అమలైన తీరు తెన్నుల సమాచారం ఉంది. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఎన్ని నిర్వహించారు? మండల, గ్రామ కమిటీల సమావేశాలు జరిగాయా? తదితర వివరాలను నివేదికల్లో పొందుపరిచారు. వీటిలోని కొన్ని వివరాలతో ఎమ్మెల్యేలు విభేదించారు.