ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 27 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. తూళ్లూరులో నిర్వహిస్తున్న మహాధర్నాలో పెద్దఎత్తున్న ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు మందడంలో రాజధాని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడవ పెట్టి వాహనాల రాపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పడవను బలవంతంగా పక్కకు తొలగించారు. రోడ్డుపై టెంట్ తీసి ఉదయాన్నే వేసుకోండని శనివారం రాత్రి డీఎస్పీ చెప్పారని.. ఇప్పుడు టెంట్ వేయనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నవులూరు, ఎర్రబాలెంలో రాజధాని రైతులు రాస్తారోకో నిర్వహించారు. వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెంలో స్థానికులు ధర్నా చేపట్టారు. రాజధాని రైతుల ఆందోళనలకు పలువురు నేతలు మద్దతు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa