ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని అమరావతి భావి తరాలకు ‘ఆశ’గా ఉండాలి : చంద్రబాబునాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2019, 04:27 PM

రాజధాని అమరావతి భావి తరాలకు ‘ఆశ’గా, ‘డ్రీమ్ క్యాపిటల్’ గా ఉండాలని ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అన్నారు. యువతకు భవిష్యత్ ఇచ్చేలా, ఉపాధి కల్పించేలా ‘అమరావతి’ ఉండాలని.. రాజధాని అనేది సంపద సృష్టించాలని, లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదని సూచించారు.పదమూడు జిల్లాల అభివృద్ధికి, ఆదాయ వనరు, నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఉద్యోగాల కల్పవల్లి, ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం ‘మన రాజధాని అమరావతి’ అని అన్నారు.ఆరోజున  అందరినీ సంప్రదించిన తర్వాతే ప్రజారాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని చెప్పారు. నాడు శివరామకృష్ణయ్య నివేదికను పట్టించుకోలేదని తమపై వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను ఖండించారు. పదమూడు జిల్లాలకు సెంటర్ లో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa