ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందవరం మండలంలో బయట పడిన సొరంగం…

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2019, 02:09 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలం ముగతి గ్రామం నందు గ్రామ నడిబొడ్డున ఉన్న గ్రామ చవిడి దగ్గర సుమారు 40 అడుగుల మేర స్వరంగం బయటపడింది. ఆ స్వరంగం దాదాపు మూడు తరాల క్రితందై ఉండొచ్చని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ  స్వరంగం లో ఏమి ఉందొ అని చూడటానికి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తుండడంతో ఆ ప్రాంతం అంత పర్యాటక వాతావరణాన్నితలపిస్తోంది. ఈ స్వరంగం సమాచారం అందుకున్న పోలీసులు సిఐ మహేశ్వరరెడ్డి, ఎసై వేణుగోపాల్ రాజ్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సొరంగాన్ని పరిశీలించారు. దీని పై పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa