గుంటూరు : ‘రాష్ర్టంలో రైతులు పండించిన మిర్చినంతా కొనుగోలు చేస్తాం. ఆపదలో ఉన్న మిర్చి రైతులకు రాష్ర్ట ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతన్నలు మనో ధైర్యం కోల్పోవద్దు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు’ అని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. గుంటూరులో మిర్చి కొనుగోళ్లపై మరో ఇద్దరు మంత్రులు ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లా రావులతో కలిసి ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ర్టంలో 17 శాతం సాగు, 29 శాతం పంట ఉత్పత్తి పెరిగిందన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నార న్నా రు. వీటిని దష్టిలో ఉంచుకొని యార్డు ఉద్యోగులు, అధి కారులు, హమాలీలు పని చేయాల్సి ఉందన్నారు. ఇబ్బం దులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మిర్చి కొను గోలు సందరేంగా యార్డులో కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మార్కెటింగ్ శాఖ మం త్రి ఆది నారాయణరెడ్డి అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రైతు లను ఆదుకోవడానికి అందరు సహకరించాలన్నారు. మిర్చి రైతుకు క్వింటాల్ రూ. 1,500 బోన్సగా ఇచ్చిం దన్నారు.
దీనిని అర్హులైన రైతులందరికి అందే విధంగా మార్కెటింగ్, వ్యవసాయ, ఇతర ప్రభుత్వ శాఖలు కషి చేయాలన్నారు. సమస్యల్లో ఉన్న రైతులను ఆదుకో వడానికి ప్రభుత్వం ముందుంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.