ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్నాచౌక్‌ తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:53 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః  ఇందిరాపార్కు నుంచి ధర్నాచౌక్‌ను నగరశివార్లకు  తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామిక ఆందోళనలను అణిచివేయాలన్న లక్ష్యంతోనే ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.  ప్రజలకు అందుబాటులో లేకుండా నగరానికి దూ రంగా ధర్నాచౌక్‌ను  తరలించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ   ప్రజలు స్వచ్చం దంగా ఉద్యమిస్తుంటే, అదే సమయంలో ధర్నా చౌక్‌ను తరలించాలంటూ స్థానికుల పేరిట ధర్నాలు చేయించడం ప్రభుత్వ కుట్రలో భాగమే నన్నారు. ఒకే సమయంలో రెండు వర్గా లకు అనుమతి ఇవ్వడం  చూస్తుంటే ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టమవుతుందని  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సోమ వారం  ధర్నాచౌక్‌ ఆక్రమణ పేరిట  జరి గిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు  గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  విలేకరులతో మాటా డుతూ ధర్నాచౌక్‌ తరలింపును వ్యతిరేకిస్తూ ఆందో ళన దిగినవారిపై  స్థానికుల ముసుగులో సర్కార్‌ ప్రోత్సాహంతో  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు  దాడి చేయి ంచడం దుర్మార్గమని మండిపడ్డారు. శాంతి భద్ర తలు కాపాడి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీ సులు, ప్రభుత్వం ఇలా ప్రజలపై దాడులు చేయడం ఒక దుర్మార్గమైన కుట్ర పూరిత  ఆలోచన అని ఇది ప్రజా ప్రభుత్వం చేసే పనేనా అని ఆయన ప్రశ్నిం చారు.  టీఆర్‌ఎస్‌ పౌర హక్కులను కాలరాసే విధ ంగా వ్యవహ రిస్తుందని,   ధర్నాచౌక్‌ ఎన్నో ఏళ్ళుగా ఆ ప్రాంతంలో ఉందని అక్కడ తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్థానికులు  చెబుతున్నార న్నారు.  స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌  ప్రజలతో చర్చించారని, స్థానికులు తమకు  ఎలా ంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారని ఉత్త మ్‌ పేర్కొన్నారు.  ప్రభుత్వం ప్రజలకు స్వేచ్చ కల్పించే విధంగా పనిచేయకుండా నిర్బంధం కలిగించడం ఏమి టని ఆయన విమర్శించారు. 


ఉత్తమ్‌తో పాటు  ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, డికె అరు ణ, రాంమోహన్‌ రెడ్డి, వంశీచందర్‌ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, మాజీ ఎం.పి మల్లు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com