హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి
అనంతపురం,సూర్యప్రతినిధి: హెరిటేజ్ సంస్థను 2022 నాటిని రూ.6వేల కోట్ల టర్నోవర్కు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో నిర్వహించిన హెరిటేజ్ 25 వసంతాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాత, నాన్న ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హెరిటేజ్ సంస్థ రైతుల సంక్షేమం కోసం రైతు నిధి ఏర్పాటు చేసిందన్నారు. ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తూ చనిపోతే సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు. సంస్థ లాభాల బాటలో పయనించేందుకు సిబ్బంది చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. తాత ఎన్టీఆర్, పెదనాన్న, నాన్న ప్రాతినిధ్యం వహించిన హిందూపురానికి రావడం ఆనందంగా ఉందని హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. హెరిటేజ్ సంస్థ రైతుల సంక్షేమం కోసం రైతు నిధి ఏర్పాటుచేసిందని తెలిపారు. . ఈ సందర్భంగా రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. భర్తను కోల్పోయిన మహిళా రైతుకు రూ.2లక్షలు పరిహారం అందజేశారు. సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తోన్న సిబ్బందిని ఆమె అభినందించారు.