న్యూఢిల్లీ: ఆమ్ ఆదీ పార్టీ(ఆప్)లో అంతర్గత కలహాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు చేయడంతో కపిల్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా సీఎం సహా ఆప్ నేతల విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించాలని మిశ్రా దీక్ష చేస్తున్నారు. దీంతో మిశ్రాకు వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆందోళన చేపట్టారు. కపిల్ మిశ్రా ఇంటి ఎదుట ధర్నా చేపట్టడానికి కార్యకర్తలతో వచ్చిన బురారి శాసనసభ్యుడు ఝాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకు అనుమతి లేకపోవడంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.