ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కడు మిగిలాడు' లేటెస్ట్ పోస్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 02:53 PM

మంచు మనోజ్ అప్‌కమింగ్ మూవీ ఒక్కడు మిగిలాడుకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ రిలీజైంది. మంచు మనోజ్ ఎల్టీటీఈ టైగర్ వేలుపిల్లై ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. లేటెస్ట్ పోస్టర్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. తొలిసారిగా తాను డ్యూయల్ రోల్స్ పోషిస్తున్న సినిమా అని పేర్కొన్నారు మంచు మనోజ్. శ్రీలంకలో వున్న తమిళులకి ప్రత్యేక రాజ్యం, స్వేచ్ఛా ప్రపంచం కోసం 1976లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం పేరిట ప్రభాకరన్ ఏర్పాటు చేసిన మిలిటెంట్ సంస్థని ఆ తర్వాతి కాలంలో శ్రీలంక ప్రభుత్వం టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించింది. శ్రీలంకకి పక్కలో బళ్లెంలా మారి దాదాపు 25 ఏళ్లు పోరాడిన ప్రభాకరన్‌ని 2009లో మే 18న శ్రీలంక ఆర్మీ దళాలు హతమార్చాయి.ప్రభాకరన్‌ని మట్టుపెట్టడం కోసం దాదాపు రెండు దశాబ్ధాలపాటు శ్రీలంక, భారత్ దేశాల మధ్య పెద్ద సెర్చ్ ఆపరేషనే జరిగింది. ఈ కథా నేపథ్యంతోనే మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు సినిమాను అజయ్ అండ్రూ నూతక్కి డైరెక్ట్ చేస్తున్నారు. ఇదే నెలలో టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్టు ఈ లేటెస్ట్ పోస్టర్ ద్వారా స్పష్టంచేసింది మూవీ యూనిట్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com