ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఏడు జిల్లాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 02:31 PM

అమరావతి: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ తెలిపింది. కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. రానున్న నాలుగైదు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. అంతేగాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఇస్రో హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com