తాళ్ళూరు, మేజర్న్యూస్ : భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తుంటే పతిపక్షనేత మాత్రం విమర్శలు చేయడం దురదృష్టకరమని అటవీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మండలంలోని గుంటిగంగ వద్ద కాపు కల్యాణ మండపంలో మండల టీడీపీ అధ్యక్షులు పెదకా లేషావలి అధ్యక్షతన జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ.పీ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రోడ్లు అభివృద్ది చేయటమే కాక, ఆర్టీసిలో విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చామ న్నారు. అందులో భాగంగానే 82 బస్సు సర్వీస్లకు అన్లైన్ ద్వారా టిక్కెట్ పోందే అవకాశం కల్పించామన్నారు. రెండు, మూడు నెలల్లో ప్రపంచలోని అనేక దేశాల నుండి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అసక్తి కనపరుస్తు న్నారు. రూ.75 కోట్ల నిధులతో చీమకుర్తి, దర్శి రోడ్డు అభివృద్ది పనులు జరుగుతున్నాయని, దర్శి నియోజకవర్గంలోని 5మండలాల్లో తాగునీటి సౌక ర్యాన్ని మెరుగు పర్చాలన్న ఉద్దేశంతో సొంత నిధులతో 75 ఆర్వోప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. తాళ్ళూరు మండలంలో సాగు, తాగు నీటీ సౌకర్యం మెరుగు పరిచేందుకు శివరాంపురంలో రూ. 2.06 కోట్ల నిధులతో మొగలి గుండాల రిజర్వాయర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించామన్నారు. రాష్ట్రంలో కరువును పారదోరాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కేవలం 18 నెలల్లో పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా గోదా వరి జలాలలను కృష్ణానదికి నదులు అనుసంధానం ద్వారా ఆయకట్టు భూమి లకు నీరు అందించారు. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసే విధం గా ప్రభుత్వం కృషి చేస్తుందని, వెలుగొండ ప్రాజెక్టును 2019 నాటిక పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో రూ.150 కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని, గ్రామా లలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తా మన్నా రు. దర్శి నియోజకవర్గంలో 20 సంవత్సరాల్లో చేపట్టాల్సిన అభివృద్ది కార్య క్రమాలను కేవలం 3 సంవత్సరాల్లో పనులు పూర్తిచేసి ప్రజల మద్దుతు పొందా మన్నారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షులుగా 3వ సారి ఎస్.కొండారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏఎంసి సూరే సుబ్బారావు, రమేష్బాబు, బ్రాహ్మరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంకటరెడ్డి, రామయ్య, రమణారెడ్డి, ఓబులురెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు సుబ్బారావు, సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా సంఖ్యలో పాల్గొన్నారు.