(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : అమరావతి రాజధానికి తలమానికం కానున్న గవర్నమెంట్ కోర్ ఏరియాని అభివద్ధి చేసేందుకు సింగపూర్ కన్సార్షియం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. అనంతరం ఉద్ధండ్రాయునిపాలెం - తాళ్ళాయపాలెం మధ్యన కోర్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి గవర్నమెంట్ కోర్ నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోనున్నారు. రాజధానిలో గవర్నమెంట్ కోర్ ప్రాంతంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఉంటాయి. వీటితో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల హెచవోడీలు, సివిక్ ప్లాజా, సివిక్ యాక్సిస్, రాష్ర్ట మంత్రులు నివాసాలు నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో డిజైన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుందని మాస్టర్ ప్లాన రూపొందించిన సంస్థ పేర్కొన్నది. పచ్చదనానికి అభిముఖంగా నిర్మిస్తారు. పచ్చదనం ప్రదేశాల్లో క్యాంటినలు, కాఫీ షాప్లు, డైనింగ్ వంటివి నిర్మిస్తారు. మొత్తం 564 హెక్టార్లలో సుమారు 7.4 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోర్ కేపిటల్ నిర్మాణం జరుపుతారు. ఇందులో ఆరు లక్షల మంది ప్రజలు నివాసం ఉండటానికి కూడా భవంతులు నిర్మిస్తారు. ఉన్నతస్థాయి ర్యాంకు కలిగిన అధికారులకు ఇళ్లను కూడా కోర్ ఏరియాలోనే నిర్మిస్తారు. సిటీ గ్యాలరీ, కల్చరల్ సెంటర్ని కూడా నిర్మిస్తారు. కోర్ కేపిటల్ నిర్మాణం విషయంలో వాస్తుకు కూడా అధిక ప్రాధాన్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కష్ణానదికి అభిముఖంగా నిర్మించే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు రాజధానికి కొత్తరూపు తీసుకొస్తాయని సీఆర్డీఏ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఏపీ రాజధాని నిర్మాణంలో మరో అడుగు : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడనుంది. స్టార్టప్ ఏరియా అభివ ద్ధికి సింగపూర్ కన్సార్టియంతో సీఆర్డీయే ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఒప్పందం జరగనుంది. ఈశ్వరన్ వెంట 18 మంది బడా పారిశ్రామిక వేత్తలు అమరావతి రానున్నారు. ఈ నెల 15న విజయవాడలో అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. అదే రోజు సాయం్త్రం ఉద్దండరాయనిపాలెంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.