ఇంటర్నేషల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు
తిరుపతి, మేజర్న్యూస్ : పులివెందులకు చెందిన శ్రీరామాంజులు రెడ్డి ఆయన సతీమణి వెంకట సుజాత అనే భక్తులు శనివారం రూ. 16 లక్షల విలువైన ధర్మవరం పట్టుపంచ, ఉత్తరీయంను శ్రీవారికి కానుకగా అందజేశారు. పట్టుపంచ, ఉత్తరీయం తయారీలో వెండి, బంగారం కలిపి ఒక ఇలోను వినియో గించారు. ధర్మవరానికి చెందిన రాఘవేంద్ర గ్రూప్ మగ్గం పనివారు వీటిని తయారు చేశారు. ఈ పట్టుపంచ, ఉత్తరీయం తయారీలో మొబైల్ మగ్గం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది శ్రీవారి భక్తులు భాగస్వాములయ్యారు. ఈ మొబైల్ మగ్గం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పర్యటించింది. ఈ పట్టుపంచ, ఉత్తరీయంలో ఓం నమో వేంకటేశాయ పేరుతో ఒక లక్షకు పైగా నామాలు కనిపిస్తాయి. మొబైల్ మగ్గం నేత పనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ పట్టుపంచ ఉత్తరీయం తయారీలో ఎక్కువమందిని భాగస్వాములను చేసేందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైనట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని రాఘవేంద్ర గ్రూప్కు అందజేశారు.