ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు వలసబాట పట్టిన ఏపీ నిర్మాణ కార్మికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 04:45 PM

కర్నూలు జిల్లాలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు వలసబాట పడుతున్నారు. పనులు దొరుకుతాయన్న ఆశతో పొరుగున ఉన్న తెలంగాణకు తరలిపోతున్నారు. ఆ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ఇప్పుడు పత్తి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆ విషయం తెలుసుకొని, అక్కడికి వెళ్లడానికి ఎమ్మిగనూరు పట్టణంలో లారీ ఎక్కుతున్న భవన నిర్మాణ కార్మికులు గురువారం కనిపించారు. గతంలో వారం పొడవునా పనులు ఉండేవని, ఇసుక కొరత కారణంగా ఇప్పుడు వారంలో ఒక్క రోజు కూడా పనికి పిలిచేవారు లేరని వారు వాపోయారు. పూట గడవటమే కష్టంగా మారడంతో వీరంతా పిల్లాపాపలతో వలసబాట పట్టారు. ఎమ్మిగనూరు పట్టణమనేకాదు, మంత్రాలయం నియోజవర్గంలోని కోసిగి, కౌతాళం మండలాలదీ ఇప్పుడు ఇదే పరిస్థితి!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa