ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని అసమర్థత వల్లే పాక్‌ సైన్యం రెచ్చిపోతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 12, 2017, 02:15 AM

మోడీకి గాజులు పంపి ఏపి మహిళా కాంగ్రెస్‌ వినూత్న నిరసన


   విజయవాడ, సూర్య బ్యూరో : అసమర్ధ ప్రధాని నరేంద్రమోదీ కేవలం తన ప్రసంగాల తోనూ, ప్రచారాల తో నూ కాలం వెలి బుచ్చు తున్నారని, భారత సైనికులకు దేశం యావత్తూ అండగా ఉండాలని ఏపి మహిళా కాం గ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని పేర్కొంటూ అందుకు వ్యతిరేకంగా ఏపి మహిళా కాంగ్రెస్‌ అధ్వర్యంలో ఏపిసిసి రాష్ర్ట కార్యాలయంలో గురువారం వినుత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి గాజులు పంపిం చి ఏపీసీసీ మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో సుంకర పద్మశ్రీ మట్లాడుతూ బిజేపి పాలనలో దేశ ప్రజతో పాటు జవాన్లకు కూడా రక్షణ కరువైందన్నారు. మోదీ అసమర్థత వలన పాక్‌ సైన్యం రెచ్చిపోతోందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి 250 మందికి పైగా భారత జవాన్‌లను పాక్‌ సైన్యం ఊచుకోత కోసిందన్నారు. భారత్‌ జవాన్‌ల ప్రాణా లను కాపాడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. గతంలో పాకిస్తాన్‌ భారత్‌ సైనికులపై దాడి చేసిన సమయంలో మన్మోహన్‌సింగ్‌కి గాజులు పంపిన స్మ తీఇరానీ ఇప్పుడు పాకిస్తాన్‌ సైన్యం భారత్‌ జవాన్‌ల తల లు నరుకుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము పంపిన గాజులను ఇరానీ మోదీకి తొడ గాలని ఏపీ మహిళా కాంగ్రెస్‌ తరుపున డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి మహిళా నాయకులు వజ్రపు లెవియ బాబ్జి, జక్కుల ఇందిరాగాంధీ, ప్రమీలగాంధీ, రెహనా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com