తిరుపతి, మేజర్న్యూస్ : తిరుచా నూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల యంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్స వాలు గురువారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొ లిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిం చనున్నారు. రాత్రి 8.30 నుండి 9.00 గంటల వరకు మహా పూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఆలయ ఎఈవో రాధాకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మహతి కళాక్షేత్రంలో : తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు చెన్నైకి చెందిన కుమారి దీపిక బౄఎందం గాత్ర సంగీత కార్యక్రమం జరుగ నుంది. ఈ కార్యక్రమంలో తితిదే ప్రాజెక్టుల ఉపకార్య నిర్వహణాధికారి శ్రీమతి శారద, అన్నమాచార్య ప్రాజెక్టు రీసెర్చి అసిస్టెంట్ డాసి.లత ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.