ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వర్ణరథంపై మెరిసిన పద్మావతి అమ్మవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2017, 04:38 AM

  తిరుపతి, మేజర్‌న్యూస్‌ : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్స వాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం స్వర్ణరథం పై అమ్మ వారు భక్తులకు అభయ మిచ్చా రు. ఇందులో భాగంగా ఉద యం సుప్ర భాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్రనా మార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరే గింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉద యం 8.15 గంటలకు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మ వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తు లకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు వైభ వంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  అనంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే ఇష్టకార్య సిద్ధి, మరో జన్మ ఉండదని తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆల యం నుండి శుక్రవారపు తోట కు ఊరే గింపుగా తీసుకెళ్లారు. అనంతరం అక్కడ స్నపన తిరు మంజనం నిర్వహిం చారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు. ఈ కార్యక్ర మంలో అదనపు సివి అండ్‌ ఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యే క శ్రేణి డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి, ఆలయ ఎఈవో రాధా కృష్ణ, ఇతర అధికా రులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com