విజయవాడ : పూడ్చివేత కోసం బావిలోనికి దిగిన ఇద్దరు వ్యక్తులు బావిలో విషవాయువుల కారణంగా ఊపిరాడక మరణించిన సంఘటన కృష్ణా జిల్లాలో ఈ ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.అగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే రైతు తన పొలంలో ఉన్న పాత బావిని పూడ్చివేయడం కోసం ఇద్దరు కూలీలను మాట్లాడుకున్నారు. ఓసూరి నర్సింహ (28), మల్లయ్యస్వామి(32) అనే కూలీలు బావి పూడ్చివేత కోసం బాలిలోనికి దిగారు. అయితే విషవాయువుల కారణంగా వారిరువురూ ఊపిరాడక మరణించారు.