గుడ్లూరు: ప్రకాశం జిల్లా గుండ్లూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామదూత ఆశ్రమంలో కేంద్రమంత్రులుశుక్రవారం పర్యటించారు. ఆశ్రమంలో జరిగిన సువర్ణలక్ష్మి దాంపత్య దీక్షా విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి, భాజపా అగ్రనేత డా. మురళీ మనోహర్ జోషి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు రామదూత స్వామి అనుగ్రహ భాషణం చేశారు. చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్, తెలంగాణకు చెందిన భాజపా ఎమ్మెల్యే ప్రభాకర్, జిల్లా సంయుక్త కలెక్టర్ హరిజవహర్లాల్ తదితరులు హాజరయ్యారు. .