నల్గొండ: నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సందర్శించారు. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసుపత్రిలోని సమస్యలను గవర్నర్ కు వివరించారు. కాగా... రోగులకు సరిపడా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ను గవర్నర్ ఆదేశించారు.