హైదరాబాద్: గ్రామ స్థాయిలో సేవలందించే ఆశ వర్కర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఏఎన్ఎం నియామకాల్లో వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ప్రగతి భవన్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సీఎం సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంల పరిస్థితి మారాల్సి ఉందన్నారు. శిక్షణ పొందిన ఆశ వర్కర్లను ఏఎన్ఎంలుగా నియమించాలని సీఎం అన్నారు. వచ్చే ఏడాది వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు పెంచి ఆశ వర్కర్లరకు ప్రోత్సాహకాలు పెంచుతామన్నారు. గర్భిణులకు నగదు సాయం, కేసీఆర్ కిట్ పథకాలను సమర్థంగా అమలు చేయాలని వారికి సూచించారు.