ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష . సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి .

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 05, 2017, 02:38 PM

బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష . సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి .

దోషుల అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ..ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ టాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు నేటికి వాయిదా పడింది.2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. కాగా, దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహర్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దీంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు. 16-18ఏళ్ల మధ్య వయస్సున్నవారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లుగా భావించాలని ఈ చట్టం ద్వారా స్పష్టం చేశారు. ఫిజియోథెరపీ చదువుతున్న నిర్భయ తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో బస్సులో ఎక్కింది. కాగా, అతడిపై తీవ్రంగా దాడి చేసిన ఈ ఆరుగురు దోషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్ర హింసలకు గురిచేశారు. ఆమె కొద్ది రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు చేసుకున్న అప్పీలుపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తుది తీర్పును శుక్రవారం వెల్లడించింది . న్యాయమూర్తులిద్దరూ వాళ్ల అప్పీలును తిరస్కరించి  నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com