గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, బోర్డు డైరెక్టర్లలు, హమాలి నాయకులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం. *పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు, కలెక్టర్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. *యార్డుకు భారీగా మిర్చి రావటంతో కొనుగోలుపై పరిష్కర మార్గాలను చర్చించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. *టెలికాన్ఫూరెన్స్ ద్వారా సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించి పరిస్థితిని వివరించిన మంత్రి. మిర్చి యార్డుకు మే 15 నుంచి జూన్ 4 వరకు సెలవులు ఉన్నందున రాష్ట్రంలో కర్నూలు, ఒంగోలు, వినుకొండ, నందిగామ, నడికుడిలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. *ఈ కొనుగోలు కేంద్రాలు శని, ఆదివారాలలో కూడా కొనుగోలు జరుగుతుందన్నారు. జూలై 15వరకు మిర్చి కొనుగోలును కొనసాగిస్తామన్నారు. *మూతపడిన కోల్డ్ స్టోరేజ్లను తెరిపించి మిర్చి నిల్వ చేసుకొనేందుకు వినియోగిస్తామన్నారు. ఈ 5 కేంద్రాలలో కొనుగోలు జరిపిన వ్యాపారస్తులకు ట్రాన్స్ పోర్ట్ చార్జిలలో ప్రభుత్వం కొంత రాయితీని కల్పిస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు తెలిపారు. *హమలి నాయకులతో చర్చించి ఎక్కువ పనిదినములు పనిచేయాలని, అందుకు అదనపు వేతనం చెలిస్తామని సూచించారు.